ఆ తరువాత గోశాలలో గల గోవును అలంకరించి, ప్రదక్షిణలు చేసి పూజించాలి. కొంతమంది మరింత భక్తిశ్రద్ధలతో ఈ రోజున గోష్ఠాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. గోవు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, గోవును పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
సిరిసంపదలకు ... పాడిపంటలకు కొదవనేది ఉండదని పండితులు అంటున్నారు. ఇంకా గోమాత పూజ సకల దేవతలను పూజించినట్లవుతుందని, తద్వారా ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు దూరమవుతాయని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.