ఏడవడం బాధాకరనమైన స్థితే కానీ, జరిగిన నష్టాన్ని మన శరీరమూ, మనసూ ఆమోదించే మార్గమే అది. ఆ దుఃఖాంశాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, అదొక దిక్కుతోచని పరిస్థితిలోకి తీసుకెళుతుంది. అంతిమంగా అది మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు గురయ్యేలా చేస్తుంది. అందుకే దుఃఖాన్ని, వాటి తాలూకు కన్నీళ్లను బయటికి రానీయడమే క్షేమకరం అంటున్నారు మానసిక నిపుణులు.
ఎందుకంటే.. ఏడుపు ఎదలో మకాం వేశాక, కన్నీళ్ల రూపంలో దాన్ని బహిర్గతం చేయడం తప్పనిసరి. జరిగిన విషాదం తాలూకు నష్టాన్ని గురించి ఆలోచించకకుండా వాటిని మరిచిపోయే ప్రయత్నాల్లో ఏడుపు ఒకటి. అందుకే ఏడుపొస్తే, ఏడ్చేయడమే ఎంతో ఆరోగ్యకరం. అందుకే మానసికవైద్య నిపుణులు అంటారు... శోకం నాడీ వ్యవస్థ, మానసిక వ్యవస్థల్లోని భారాన్ని తొలగించే గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.