ఫేస్ బుక్, ట్విట్టర్ అంటూ ఇంటికొచ్చినా.. చాలామంది పురుషులు స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న వారు సైతం సోషల్ నెట్ వర్క్ సైట్స్తో టచ్లో ఉండే ఈ-కాలమిది. ఫేస్ బుక్, ట్విట్టర్ల పుణ్యమా అని టచ్ ఫోన్లు వాడే వారు అర్థరాత్రైనా భాగస్వామిని ఏమాత్రం పట్టించుకోవట్లేదట. ఈ క్రమంలో వినోదం అందించే ఈ స్మార్ట్ ఫోన్లు భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నాయి.
పొద్దస్తమానం ఫోన్లు, గేమ్స్ ఆడటం లేకుంటే సామాజిక మాధ్యమాలతో బిజీగా ఉంటున్నారట. దీంతో పడకగదిలో కూడా సఖ్యంగా ఉండకుంటే ఎలా అంటూ చాలామంది భార్యామణులు వాపోతున్నారట. ఇటీవల ఆక్స్ ఫర్డ్ వర్శిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో భార్యాభర్తల సఖ్యతకు స్మార్ట్ ఫోన్లు చెక్ పెడుతున్నాయని తేలింది. 24వేల పెళ్ళయిన జంటలపై సర్వే చేసిన పరిశోధకులు ఫోనుకే అంకితమైన ఈ జంటల్లో ఎక్కువభాగం త్వరగా విడిపోయారని తేల్చారు.
ఇదే తరహాలో భారతీయ జంటలు కూడా స్మార్ట్ ఫోన్ల మోజులో జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో 18 నుంచి 82 ఏళ్ల మధ్య వారు సామాజిక వెబ్ సైట్స్ అధికంగా యూజ్ చేస్తున్నారని, టీనేజర్లు, మిడిల్ ఏజ్ పురుషులు అధికంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు.