పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా.. ఇక ఆపండి!

సోమవారం, 12 జనవరి 2015 (17:00 IST)
పదే పదే ఈ మెయిల్స్ చెక్ చేస్తున్నారా..? ఇక ఆపండి అంటున్నారు పరిశోధకులు. రోజులో ఎక్కువసార్లు ఇ-మెయిల్ చూసుకోవడం వల్ల మనుషులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇ-మెయిల్స్ ఎంత తక్కువగా చూస్తే ఒత్తిడి అంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.
 
సర్వసాధారణంగా రోజుకు ఎన్నిసార్లు వాళ్లు ఇ-మెయిల్ చెక్ చేసుకునేవారో అలాగే చెక్ చేసుకోమని  పరిశోధకులు సూచించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ పరిశోధనలో రోజులో తక్కువ పర్యాయాలు ఇ-మెయిల్ చెక్ చేసుకునే వారిలో ఒత్తిడి తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఇ-మెయిల్స్ ఎక్కువసార్లు చూడకుండా ఉండేందుకు తమను తాము నిగ్రహించుకోవడానికి కష్టపడ్డారని తేలింది. 

వెబ్దునియా పై చదవండి