కార్తీక మాసం చివరి రోజు.... దీప దానం చేయండి...

సోమవారం, 28 నవంబరు 2016 (17:43 IST)
కార్తీక మాసం చివరి రోజు. ఈ రోజున వెండి ప్రమిదలో బంగారపు రంగుతో అంటే... పసుపును పూసిన వత్తితో దీపం వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానం చేయండి. ఆపై బ్రాహ్మణునిని అన్నదానం కూడా చేయండి. దీపాన్ని దానం చేసేటప్పుడు... 
 
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంప త్సుఖావహం"
"దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ"-
 
అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి. ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపదానం చేస్తే విద్య, దీర్ఘాయువు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియక గానీ చేసే పాపాలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి