కార్తీకమాసంలో స్వామివారి సేవలోను ... అమ్మవారి అనుగ్రహంతోను తరించిన భక్తులు, మార్గశిరంలో అడుగుపెడుతూనే ఉమా మహేశ్వరుల అనుగ్రహాన్ని కోరుతూ వారిని ఆరాధిస్తారు. ఇంకా కార్తీక మాసం చివరి రోజున ఆది దంపతులను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.