మాహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ మాయకోతులను ఆడిస్తుంది.. అమావాస్య నాడు పున్నమి చంద్రుడు

బుధవారం, 29 జూన్ 2016 (17:04 IST)
పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని ఇప్పటికే జరిగిపోయాయి. మరికొన్ని జరుగుతాయి అనేందుకు గత చరిత్రే నిదర్శనం. ఆయన చెప్పినవాటిలో మరికొన్ని...
 
నలు దిక్కులయందు దివ్యమైన నక్షత్రాలుపుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి.
అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు. నిజమని నా మహిమను తలచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశినాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది.
తూర్పున శిరసు పడమర తోకగా ఇరువది బారల ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన ముప్పై రోజుల వరకు అందరికి కనిపిస్తుంది. ఆకాశం ఎర్రపడుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి.
 
బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది.
మాహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది.
కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది.
కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది.
కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.

వెబ్దునియా పై చదవండి