మహాదేవుడిని గరికపూలతో పూజిస్తే.. సౌభాగ్యం..?

శనివారం, 20 డిశెంబరు 2014 (18:59 IST)
ముక్కంటి.. ఆదిదేవుడు.. మహాదేవుడు అడవీ ప్రదేశాల్లో లభించే పూలతో పూజలందుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. వాటిలో ఒక్కోరకం పూలతో పూజించడం ద్వారా స్వామి వారి అనుగ్రహం పొందవచ్చు. అలాగే స్వామికి గరికపూలు ప్రీతికరమైనవి అని అంటారు. 
 
గరికపూలతో స్వామిని అర్చించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది. కలకాలం నిలిచే సౌభాగ్యాన్ని ఇవ్వమనే స్త్రీలంతా ఎన్నో పూజలు.. వ్రతాలు చేస్తుంటారు. అలాంటి ఫలితం ఆదిదేవుడికి గరికపూలను సమర్పించడం వలన లభిస్తుందని పండితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి