సోమవారం పూట ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని, పూజామందిరంలోనే పూజాభిషేకాలు చేయడం మంచిది. లేకుంటే ఆలయాల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం మంచిది. సదాశివుడిని అంకిత భావం, చిత్తశుద్ధితో పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించడం వలన సమస్తపాపాలు పటాపంచలై పోవడమే కాకుండా, సంపదలు, భోగభాగ్యాలు చేకూరుతాయి.
సదాశివుడికి వివిధరకాల పండ్లను, గారెలు - బూరెలు వంటి పిండివంటలను ... పాయసం వంటి తీపిపదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. లేకుంటే బిల్వ పత్రాలతో అర్చించాలి. ఇలా ఆదిదేవుడికి సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ 'లేమి' అనే మాట వినిపించదని పండితులు అంటున్నారు. అంటే ఆ స్వామి అనుగ్రహం వలన దారిద్ర్యం అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి రాదని వారు అంటున్నారు.