సీతమ్మవారి పాదముద్రను తాకితే ఆ తల్లి ఆశీస్సులు లభించినట్లు భక్తులు భావిస్తుంటారు. ఆ నీటిని స్పర్శించినా, తలపై చల్లుకున్నా, తీర్థంగా స్వీకరించినా పాపాలు హరించిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
రాముడి వెంట వనవాసానికి బయలుదేరిన సీతమ్మ ఎన్నో ప్రాంతలమీదుగా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది. ఆ తల్లి పాదస్పర్శచే ఈ నేల పునీతమైంది. అలాంటి సీతమ్మవారి పాదముద్రను పదిలంగా తన గుండెల్లో దాచుకుని, దర్శించిన భక్తులను ధన్యులను చేస్తోన్న ఈ మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూసితీరవలసిందే.