త్రినేత్రం, ముక్కంటి అనేవి పాశ్చాత్యులకు ఎంత ఆలోచించినా అంతుపట్టని అంశం. శివునిని ముక్కంటిగా కొలుస్తారు. దుర్గాదేవికి మూడో కన్ను వర్ణిస్తారు. నుదుటి మధ్యలో వున్న ఆ మూడో కన్ను తెరిస్తే ప్రళయమొస్తుందనేది ప్రగాఢ విశ్వాసం.
ఆత్మశోధనను, స్వచ్ఛతకు, నిజాయితీకి మూడో కంట చూపు దోహదపడుతుంది. కానీ దీని గురించి వినియోగించేవారు తక్కువ. వీబూది నుదిటిన రాసుకుని దాని మధ్యలో గంధం లేక కుంకుమ బొట్టును పెట్టుకోవడమే త్రినేత్ర సంకేతం.