అయోధ్య నగరం 9000 సంవత్సరాల కాలం నాటిదని చారిత్రకుల అంచనా. సూర్యవంశీయుల తర్వాత, బౌద్ధులు, జైనులు, మహ్మదీయులు కొంతకాలం పాటించారు.
ఇక్కడి మందిరాలలో ఒకచోట వాల్మీకిని చిత్రించారు. ప్రక్కనే లవకుశుల చిత్రాలు వుండటం విశేషం. యుద్ధంలో పరాజితులు కాని వారి దేశం అని, యుద్ధమే లేని శాంతి నగరమని అయోధ్యకు పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఇక్ష్వాకువంశ ప్రభువులు పూజించే శ్రీరంగనాథ దేవాలయం అయోధ్యలో వుంది.