చాలాకాలం క్రితం ఈ గ్రామంలో ఒక కృష్ణ భక్తుడు ఉండేవాడట. రుక్మిణీ సత్యభామ సమేతుడైన కృష్ణుడి విగ్రహాలు ఆయనకి ఎలా లభించాయనేది తెలియదు. ఆయన మాత్రం అనునిత్యం వాటిని పూజిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. వయసు పైబడుతున్నా ఆయన భక్తి శ్రద్ధలు ఎంతమాత్రం తగ్గలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున ఆయన స్వప్నంలో కృష్ణుడు కనిపించాడట.
శ్రీకృష్ణుడు ఆవిర్భవించిన కారణంగానే ఈ గ్రామానికి 'వల్లభి' అనే పేరు వచ్చింది. ఈ స్వామివారిని దర్శించడం వలన కష్టాలు కనిపించకుండా పోతాయనీ, సంతోషాలు సమకూరతాయని, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.