అనంత పద్మనాభుని ఆలయంలో 'దేవ ప్రశ్నం'...!

FILE
పద్మనాభ ఆలయంలో ‘దేవ ప్రశ్నం’ నిర్వహించనున్నారు. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో భారీ సంపద బయటపడిన నేపథ్యంలో సంపద లెక్కింపుపై జ్యోతిష్యం ద్వారా దైవ నిర్ణయాన్ని తెలుసుకునేందుకుగాను "దేవ ప్రశ్నం" నిర్వహించనున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు "థంత్రి" ఆమోదంలో ఈ కార్యక్రమం సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేరళ సహా ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పాల్గొంటారని తెలిసింది. ట్రావెన్‌కోర్ రాజ వంశీ యుల చొరవతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణం సమీపంలోని బంగ్లాలో నిర్వహించనున్నారు.

ఇప్పటికే ఐదు నేలమాళిగల్లో భారీ సంపద బయటపడగా, ఆరో నేలమాళిగ ద్వారంపై నాగబంధం ఉండటంతో దాన్ని తెరిచేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ దేవ ప్రశ్నం కార్యక్రమంలో ఆరో నేలమాళిగను సైతం తెరవడమా వద్దా అనే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి