కన్నులపండుగగా సీతారాముల కళ్యాణం

రెండో భద్రాద్రిగా ప్రసిద్ధి గాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ కళ్యాణమహోత్సవంలో వేలాది భక్తులు పాల్గొన్నారు.

సీతారాముల ఉత్సవ మూర్తులను దివ్య సుందరంగా అలంకరించి, కళ్యాణ వేదికను తీసుకువచ్చారు. మంగళవాయిద్యాల మధ్య, అశేష భక్తజనుల రామనామ స్మరణ, వేదపండితుల మంత్రోఛ్చారణ మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

వధూవరులుగా అలంకృతమైన సీతారాములను తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా, సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి