ఘనంగా ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

FILE
తిరుమలేశుని వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం ప్రారంభమై మూడు రోజుల పాటు జరిగిన ఈ పవిత్రోత్సవాల్లో మూడో రోజైన సోమవారం సాయంత్రం వెంకన్న స్వామి ఉభయనాంచారులతో సర్వసుందరంగా అలంకృతమై తిరుమాడవీధుల్లో ఊరేగారు.

ఇంకా సోమవారం గృహస్థులకు బహుమానం అందజేయడం, మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ, ఆరు గంటలకు హోమం, యాగశాలలో ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు, తితిదే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అనంతరం సర్వాభరణాలు, పుష్పమాలలతో ఉత్సవరులను అందంగా అలకరించి, సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించి పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఉత్సవరులు విమాన ప్రదక్షిణ చేసి ఆలయ ప్రవేశం చేశారు.

వెబ్దునియా పై చదవండి