తిరుమలలో వైభవంగా జరిగిన శ్రీవారి పవిత్రోత్సవాలు

FILE
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రతువుకు సోమవారం వసంత మంటపంలో అంకురార్పణ జరిగింది. ప్రధానాలయంలో ప్రత్యేక పూజలకు అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని పల్లకిపై పవిత్రోత్సవ మంటపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు.

పవిత్రాలను (పట్టుదండాలు) యాగశాలలో ప్రతిష్టించారు. తదనంతరం వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా హోమాలు, అభిషేకాది పూజలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకార శోభితుడైన స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ఈ ఊరేగింపులు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సర్వాలంకరణా భూషితుడైన గోవిందుని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.

వెబ్దునియా పై చదవండి