తిరుమల వేదపండితుల కుటుంబాలకు గుడ్ న్యూస్!

FILE
వేదపండితుల కుటుంబాలకు ఓ శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వేదసమ్మేళనంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధ వేద పండితులకు రూ. 8వేలను ఫించన్‌గా అందజేయాలని తితిదే వేద సమ్మేళనం నిర్ణయం తీసుకుంది. అలాగే వేద విద్యార్థుల పేరిట రూ.3లక్షలను డిపాజిట్ చేయనున్నట్లు తితిదే వేద సమ్మేళనం మంగళవారం ప్రకటించింది.

ఇంకా వేద పండితుల పేరిట ఆయుష్మాన్'భవ ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ తెలిపింది. మరణించిన వేదపండితుల భార్యలకు అయిదు వేల రూపాయల వితంతు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు వేద పండితుల సమ్మేళనం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి