అనంతరం ప్రత్యేకంగా ముద్రించిన కల్యాణోత్సవ శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు. కోటి తలంబ్రాలు, మేళతాళాలతో భద్రాచలానికి కదులుతున్న విషయాన్ని రామయ్యకు తెలియజేయాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు. ప్రతియేటా చిలుకలతో పిలుపులు ఈ ప్రాంతంలో సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే.