కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పురావస్తుశాఖ నిబంధనలు ఆలయ అభివృద్ధికి ఇబ్బందిగా ఉన్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.