ఆనంద నిలయంలో అవతరించక ముందే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భువికి వచ్చి పాదాలు మోపిన ప్రాంతం శ్రీవారి పాదాలు. ఆనంద నిలయం నుంచి అటవీ మార్గంలో 8 కిలోమీటర్లు వెలితే శ్రీవారి పాదాలు చేరుకోవచ్చు. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న రహదారి నుంచి శిలాతోరణం మీదుగా ఎత్తైన అటవీ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తూ భక్తులు పాదాల మండపానికి చేరుకుంటారు.