తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం కానుకగా అందింది. వెంకన్నకు కోయంబత్తూర్కు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ముందుగా దానికి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను కలసి కిరీటాన్ని అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.