వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో పద్మావతీ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి గురువారం ఉదయం తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన హారముతో పద్మావతీ అమ్మవారికి మరింత శోభ లభించింది. గురువారం కృష్ణ స్వామి ముఖమండపం వద్ద 12.30 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, నవకలిశాభిషేకంలు నిర్వహించారు.