పద్మావతీ అమ్మవారి సేవలో గవర్నర్
పంచమి తీర్థం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎల్ నరసింహన్ గురవారం మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు. పంచమి తీర్థం కార్యక్రమంలో పాల్గొనడానికి నరసింహన్ సతీసమేతంగా తిరుచానూరు విచ్చేశారు. పంచమి తీర్థం కార్యక్రమాన్ని తిలకించిన తరువాత అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
దర్శన సమయంలో ఆయనతోపాటు ఈవో ఎంజీగోపాల్ తదితరులు దగ్గరే ఉన్నారు. ఈ కార్యక్రమంలో జేఈవోలు, శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మి తదితరులు ఉన్నారు. దర్శనం అనంతరం గవర్నర్ ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.