ఆర్జిత సేవ అడ్వాన్సు బుకింగ్కు తిరుమల తిరుపతి దేవస్థానం తిలోదకాలిచ్చింది. తిరుమలకు వచ్చి అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చుననుకునే వారు ఆ.. ఆలోచనలు మానుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఇంతకుముందు తిరుమలలో సాధారణ భక్తులు అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు.