తిరుపతి: తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భద్రతను, ఏర్పాట్లను సమీక్షించారు. తిరుచానూరులోని అన్ని ప్రాంతాలలో తిరిగి ఏర్పాట్లును పరిశీలించారు. తిరుచానూరులో ఈ నెల 19 నుంచి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకు కనీసం 30 వేల మంది భక్తులు తిరుచానూరుకు విచ్చేస్తుంటారు.
ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు టీటీడీ, అటు తిరుపతి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే రానున్న రోజుల్లో మరింత ముఖ్యమైన వాహన సేవలు జరుగనున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజి గోపాల్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టిలతోపాటు జేఈవో పోలా భాస్కర్లు తిరుచానూరు మాడ వీధులను పరిశీలించారు.