తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నడుపబడుతున్న కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నవమి పర్వదినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు కోదండరామాలయానికి చేరుకుంటున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను టిటిడి నిర్వహించింది.