తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో భక్తజనసందోహం

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (10:51 IST)
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నడుపబడుతున్న కోదండరామస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నవమి పర్వదినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు కోదండరామాలయానికి చేరుకుంటున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను టిటిడి నిర్వహించింది. 
 
ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసింది. వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించింది. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు జరుగకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తితిదే మజ్జిగను పంపిణీ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి