తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:22 IST)
శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించింది. రంగనాయకమండపంలో సీతా,రామ,లక్ష్మణ సమేత హనుమంతుని విగ్రహాలకు స్నపన తిరుమంజనాన్ని ఆగమ శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహించారు. 
 
ప్రతియేటా శ్రీరామనవమి రోజున టిటిడి స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ వస్తోంది. సుగంధ, పరిమళ ద్రవ్యాలతో స్వామి, అమ్మవార్లకు వైభవోపేతంగా స్నపన తిరుమంజాన్ని టిటిడి వేదపండితులు నిర్వహించారు.

వెబ్దునియా పై చదవండి