మహిళల పసుపుకుంకాలకు ప్రతీకగా నిలిచే స్వర్ణరథాన్ని వేలాదిమంది మహిళలు తిరుచానూరులో లాగారు. 15 అడుగుల ఎత్తున్న స్వర్ణ రథంలో అమ్మవారు కొలువుదీరి ఉండగా ఆ వేడుకను చూడడానికి వచ్చిన మహిళలు రథాన్ని లాగి తమ పసుపుకుంకాలకు రక్షణగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సంఘటన తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో సోమవారం సాయంత్రం జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు.