ఆదివారం శ్రీవారిని 1,03,384 మంది భక్తులు దర్శించుకున్నారు. తితిదే చరిత్రలోనే ఇంత మంది భక్తులు దర్శించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, హుండీ ఆదాయం ఆదాయం 2 కోట్ల 98లక్షల రూపాయలు వసూలైంది.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనా సమయంలో మంత్రులు గంటా శ్రీనివాస్, మృణాళిని, కొల్లురవీంద్ర, పార్లమెంటు సభ్యులు తోట నరసింహం, రవీంద్రబాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్లు దర్సించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.