తిరుమలలో నీటి ఎద్దడికి చెక్ : రూ.80 లక్షలు కేటాయింపు!

శుక్రవారం, 30 మే 2014 (13:57 IST)
తిరుపతి అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుమలలో నీటి ఎద్దడి నివారణకు నెలకు రూ. 65 నుంచి 80 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. 
 
లడ్డూల కొరత లేకుండా తయారీ సిబ్బందిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 186 మంది అటవీ శాఖ సిబ్బందిని నియమించనున్నారు. 6 నెలలకు సరిపడా 30.64 లక్షల కిలోల బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 12.85 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. 32 కంపార్ట్ మెంట్లలో టీవీలను ఏర్పాటు చేసేందుకు రూ. 2.50 కోట్లను ఖర్చు చేయనున్నారు.
 
ఇంకా భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులకు చేయాలని, రద్దీని తగ్గించేందుకు సిబ్బంది తగిన చర్యలు తీసుకునే దిశగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి