ఈ ఏర్పాట్లపై ఆయన స్పందిస్తూ శనివారం నుంచి దివ్య దర్శనం టికెట్ల జారీని నిలిపివేసినట్లు తెలిపారు. టికెట్ల కోసం ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. వీవీఐపీలకు కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కల్పించకూడదన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.