శ్రీరామనవమి రోజున స్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆధారాలున్నాయని మాణిక్యాలరావు తెలిపారు. కొత్త రాజధాని ప్రాంతంలో దేవాదాయశాఖ భూములను త్వరలోనే ప్రభుత్వానికి అప్పగిస్తామని, రైతులు తీసుకున్నట్టుగానే పరిహారం తీసుకుంటామని వివరించారు.