శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరునామం రూపంలో జ్యోతి గరుడ వాహనంపై ప్రజ్వలించడం అందరికీ తెలిసిందే. తాజాగా భారీ వర్షాలకు కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు సైతం శ్రీ వేంకటేశ్వరుని తిరునామాల ఆకృతిలో దర్శనమిస్తూ.. భక్తులను అలరిస్తున్నాయి. ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయంలో ఈ దృశ్యం పర్యాటకులను, భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటోంది. అది స్వామివారి మహిమేనని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.