భూతల స్వర్గానికి కట్టుదిట్టమైన భద్రత

WD
భూతల స్వర్గం... కేరళ. ప్రకృతి రమణీయతతో శోభిల్లే కేరళ రాష్ట్రం... ఏ మూల చూసినా ఆహ్లాదకర దృశ్యాలే. అందుకే ఈ అందాల లోకాన్ని ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా సందర్శించి ఆ అనుభూతిని పొందాలనుకుంటారు.

సహజ సౌందర్యంతో అలరారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కేరళ, ఉగ్రవాదుల హెచ్చరికలతో ఉలిక్కిపడుతోంది. అహ్మదాబాద్, బెంగుళూరు పేలుళ్ల అనంతరం ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలపైనా గురి పెట్టారని నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. దీంతో ప్రశాంతంగా వుండే కేరళ ఆందోళనకు గురవుతోంది.

నిరంతరం పర్యాటకులతో కళకళలాడే కేరళ ప్రదేశాలు బోసిపోతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వ ఖజానాకు అధిక మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చే పర్యాటకం వాటా గణనీయంగా తగ్గే ప్రమాదం వుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంమీద ఉగ్రవాదుల హెచ్చరికల నేపధ్యంలో అందాల శీమ కేరళకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

వెబ్దునియా పై చదవండి