తిరిగి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ మార్కెట్ శుక్రవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు, మధ్యాహ్నం తిరిగి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది.

దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి, 17,561 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా పది పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,252 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

ఐటీ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో సెన్సెక్స్ తిరోగమనంవైపు కొనసాగుతోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో.. హెచ్‌సీఎల్ టెక్, హీరో హోండా, ఇన్ఫోసిస్, మారుతి, విప్రో వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి