స్టాక్ మార్కెట్ : స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్

సోమవారం, 5 ఆగస్టు 2013 (17:20 IST)
స్టాక్ మార్కెట్ సోమవారం నాటి ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో ముగిసింది. వరుసగా 8 రోజుల పాటు నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఈ ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 19,182 వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 5,685 వద్ద స్థిరపడింది.

ఈ ట్రేడింగ్‌లో హీరో మోటోకార్ప్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్ అండ్ పవర్, స్టెరిలైట్ ఇండియా తదితర కంపెనీల షేర్లు లాభపడగా, బజాజ్ ఆటో, టాటా మోటార్, ఎల్ అండ్ టి, భారతి ఎయిర్ టెల్, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.

వెబ్దునియా పై చదవండి