మరో బ్లాక్ మండే.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ బంద్

సోమవారం, 23 మార్చి 2020 (10:59 IST)
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. కరోనా వైరస్ ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న ప్రచారంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయారు. ఫలితంగా సెన్సెక్స్ సూచీ ఏకంగా 2 వేల పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ కూడా 8100 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పతనం కొనసాగే అవకాశం ఉండటంతో బాంబే స్టాక్ మార్కెట్‌లో ట్రెడింగ్ నిలిపివేశారు. 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టిముట్టేసింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ కరోనా వల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంద‌న్న ప్రచారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు బోరుమ‌న్నాయి. అమెరికా మార్కెట్లు కూడా డీలాప‌డ‌డంతో.. సోమవారం ఉద‌యం సెక్సెక్స్‌, నిఫ్టీలు ట్రేడింగ్‌లో ప‌త‌నం చూపించాయి.
 
సెన్సెక్స్ భారీగా ప‌త‌నం కావ‌డంతో.. సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపేశారు. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ కూడా త‌గ్గింది. యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్‌, మారుతీ సుజుకీ ఇండియా, ఐటీసీ, హీరో మోటో కార్ప్ లాంటి సంస్థ‌లు భారీగా న‌ష్ట‌పోయాయి. సోమవారం ఉద‌యం దాదాపు 10 శాతం మేర‌కు మార్కెట్లు డౌన్ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు