అగ్రస్థానాన్ని కోల్పోయిన విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్!

ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో విశ్వవిజేత విశ్వనాథన్ ఆనంద్ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. 2810 అత్యధిక పాయింట్లు సాధించిన భారత ఏస్ చెస్ క్రీడాకారుడు ఆనంద్, అగ్రస్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయాడు. లండన్ టెన్నిస్ ఛాంపియన్‌‍‌గా నిలవడంతో నార్వే చెస్ క్రీడాకారుడు మాగ్నస్ కార్ల్‌సన్‌ వరల్డ్ చెస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

మాగ్నస్ అగ్రస్థానంలో నిలవగా విశ్వనాథన్ ఆనంద్ రెండో స్థానాన్ని, ఆర్మేనియా ఆటగాడు ఆరేనియన్ మూడో స్థానాన్ని, రష్యా స్టార్ ఆటగాడు క్రామ్నిక్, ఆరోస్థానంలో తొపలోవ్‌లు నిలిచారు. ఇక భారత చెస్ ర్యాంకింగ్స్‌లో ఆనంద్ అగ్రస్థానంలోనూ, శశకరణ్, హరికృష్ణ రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి