కామన్వెల్త్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన అగ్రశ్రేణి షూటర్ గగన్ నారంగ్ మూడు విభాగాల్లో భారత్ తరపున పోటీ చేయనున్నట్లు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
కాగా.. ఫిబ్రవరి 17వ తేదీనుంచి 28 వరకు న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ కూడా ఈ షూటింగ్ పోటీలలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ఇంగ్లండ్ తరపున 22మంది ఆటగాళ్లు, ఐదుగురు అధికారులు ఆ టోర్నీకి వస్తున్నారని ఎన్ఆర్ఏఐ పేర్కొంది.
భారత షూటింగ్ జట్టులో 50 మీటర్ల రీఫిల్ విభాగంలో సంజీవ్ రాజ్పుత్, గగన్ నారంగ్, ఇమ్రాన్ హసన్ ఖాన్లు పాల్గొంటున్నారు. అలాగే 50 మీటర్ల రీఫిల్ ప్రోన్ విభాగంలో జోయ్దీప్ కర్మకర్, గగన్ నారంగ్, సుశీల్ ఘలేలు.. పదిమీటర్ల రీఫిల్ విభాగంలో గగన్ నారంగ్, పీటీ రఘునాథ్, సంజీవ్ రాజ్పుత్లు పాల్గొంటున్నారు.
ఇంకా.. 50 మీటర్ల పిస్టోల్ విభాగంలో విరాజ్ సింగ్, బాపు వంజరే, అమన్ ప్రీత్ సింగ్లు.. 25 మీటర్ల ర్యాఫిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్, పెంబ తమంగ్, గురుప్రీత్ సింగ్లు పాల్గొంటున్నారు. అలాగే 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ మెన్ విభాగంలో విజయ్ కుమార్, మహేందర్ సింగ్, విరాజ్ సింగ్లు పాల్గొంటున్నారు.