దత్తా రే ట్రోఫీకి 20మంది సభ్యులుగల జట్టు ఎంపిక..!

FILE
డిఫెండర్ పవన్ కుమార్ సారథ్యంలో 20 మంది సభ్యులుగల ఢిల్లీ ఫుట్‌బాల్ జట్టును డీఎస్ఏ బుధవారం ఎంపికచేసింది. గుర్గాన్ మరియు ఫరీదాబాద్‌లలో ఫిబ్రవరి 11 నుంచి 28 వరకు జరుగనున్న దత్తా రే ట్రోఫీలో ఈ జట్టు పాల్గొంటుంది. 19వ జాతీయ ఫుట్‌‌బాల్ అండర్-21 విభాగంలో ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో 20 రోజుల ఓపెన్ ట్రయల్ కోచింగ్ క్యాంపు నిర్వహించిన డీఎస్‌ఏ సెలెక్టన్ కమిటీ అనంతరం సమావేశమై 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో మిడ్‌ఫీల్డర్ మోను చౌదరిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

గోల్ కీపర్లు: శ్రీకాంత్ సింగ్, సురాజ్ శర్మ, గోబింద్ సేథీ, విశ్వజిత్ నేగి

ఢిఫెండర్లు: రతన్ కుమార్, ముకేశ్ నతని, పవన్ కుమార్ (కెప్టెన్), రోహిత్ సింగ్, అశిష్ రావత్, అరవింద్ మన్‌డ్రావల్.

మిడ్ ఫీల్డర్లు: మోను చౌదరి (వైస్ కెప్టెన్), జితేందర్ బిస్ట్, మనిష్ తప, కుషగ్ర రస్తోగి, ఉమేష్, సౌరవ్ సింగ్

ఫార్వర్డ్స్: అంకిత్ శర్మ, అజయ్ బరత్వల్, అభిషేక్ కుమార్, బల్వంత్ సింగ్.

వెబ్దునియా పై చదవండి