పద్మశ్రీ అవార్డు సాధించటమే నా లక్ష్యం: హారిక

FILE
పద్మశ్రీ అవార్డును సాధించటమే లక్ష్యంగా పెట్టుకుని దూసుకెళ్తున్నట్లు టాప్‌సీడెడ్, అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) ద్రోణవల్లి హారిక పేర్కొంది. ఇటీవల జరిగిన మహిళల ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకున్న హారిక, తొలిసారిగా ఆ టోర్నీ టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించింది.

ఈ నేపథ్యంలో హారిక మాట్లాడుతూ.. 2010 జనవరి 26 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జీబ్రాల్టర్‌లో జరుగనున్న అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నీలోనూ, ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు రష్యాలో జరిగే ఓపెన్ టోర్నమెంటుల్లోనూ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

అలాగే సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఒలింపిక్స్‌లోనూ, డిసెంబర్ నెలలో టోక్యోలో జరుగనున్న ప్రపంచ ఉమెన్ చెస్ పోటీల్లోనూ పాల్గొని తన విజయాల ఖాతాను పెంచుకుంటానని హారిక చెబుతోంది. కాగా.. ఈమె ప్రస్తుతం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి