పురుషుల ఆర్చరీ జట్టు ప్రాబబుల్స్‌లో శివశంకర్

వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల ఆర్చరీ పురుషుల జట్టు ప్రాబబుల్స్‌కు ఖమ్మం జిల్లా కూనవరం మండలం, వెంకన్నగూడెం గ్రామానికి చెందిన కె. శివశంకర్ ఎంపికయ్యాడు. ఆర్చరీ జట్టుకు ఎనిమిది మంది ఆర్చర్లను ఎంపిక చేయగా, ఆంధ్రరాష్ట్రానికి చెందిన ఓ గిరిజన క్రీడాకారుడికి చోటు దక్కటం విశేషంగా చెప్పవచ్చు.

కాగా... భారత ఆర్చరీ సమాఖ్య, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆధ్వర్యంలో నడుస్తున్న, కలకత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శివశంకర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు.

వెబ్దునియా పై చదవండి