ప్రీమియర్ చెస్: రెండో స్థానంలో హారిక

జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తన హవాను కొనసాగిస్తోంది. టాప్ సీడ్ అయిన హారిక ఈ టోర్నీ ఆరో రౌండ్ గేమ్‌లో విజయం సాధించింది. దీంతో ఐదు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఆరో రౌండ్ గేమ్‌లో హారిక మహిళా గ్రాండ్ మాస్టర్ మేరి గోమ్స్ (పశ్చిమ బెంగాల్)ను చిత్తుగా ఓడించింది. 88 ఎత్తుల వరకు జరిగిన ఈ పోరులో హారిక 30వ ఎత్తుతో గేమ్‌పై పట్టు సాధించింది. ఇకపోతే ఈ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్ మీనాక్షి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి