మన అథ్లెట్లు ఎన్ని పతకాలు సాధిస్తారో..!: ఆనంద్

దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధిస్తారా? అని ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌ను వెంటాడుతున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో, అక్టోబర్ 3నుంచి ప్రారంభం కానున్న ఈ క్రీడల్లో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించగలరనే దానిపట్ల ఆనంద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

‘క్రీడల నిర్వహణకు ఏర్పాట్ల గురించిన వివరాలు నాకు తెలియదు. ఎన్ని పతకాలు మనం సాధించగలమనేదే నా ఆందోళన. ఈ ఢిల్లీ గేమ్స్‌లో మన అథ్లెట్లు పతకాలు సాధిస్తారని నా విశ్వాసం’ అని ఆనంద్ చెప్పాడు. ఆనంద్ తన పౌరసత్వంపై చోటు చేసుకున్న వివాదాన్ని గత చరిత్రగా కొట్టిపారేశాడు. అతి త్వరలో తనకు గౌరవ డాక్టరేట్‌ను బహూకరిస్తారని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి