వరల్డ్ సూపర్ సిరీస్ : ఫైనల్స్‌లో జ్వాల-దిజు జోడీ

FILE
మలేషియాలోని జోహోర్‌ బహ్రులో జరుగుతున్న వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌లో భారత్ జోడీ జ్వాల గుత్తా- వి దిజుల జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పోలెండ్‌కు చెందిన రాబెర్ట్ మేట్యూసియాక్-నడియాజ్డా కోస్టియట్‌జీల ద్వయంపై గుత్తా-దిజుల జోడీ విజయం సాధించి ఏకంగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

జ్వాల-దిజు జోడీ మొదటి గేమ్‌లో రాబెర్ట్ మేట్యూసియాక్-నడియాజ్డా కోస్టియట్‌జీ జంటపై 4-4, 19-19పై స్కోరు తేడాతో విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచారు. తరువాత గేమ్‌లో అద్భుతమైన ఆటతీరుతో అలరించిన భారత జంటపై పోలెండ్ ద్వయంపై తిరుగులేని 7-0 ఆధిక్యాన్ని సంపాదించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో 2008 సంవత్సరం నుంచి అనేక సంచలనాలను సృష్టిస్తోన్న జ్వాల-దిజు జంట విజయవంతమైన జోడీగా క్రీడాభిమానుల మన్ననలను అందుకుంటున్నారు. ఈ జోడీ గత సంవత్సరం జరిగిన బిట్‌బర్గర్ ఓపెన్ మరియు బల్గేరియన్ ఓపెన్‌లో అద్భుతమైన విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాదులో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్ ఫైనల్స్‌ వరకు.. ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టోర్నీలో ఫైనల్స్‌వరకూ వెళ్లిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి