సెమీస్‌లో సాయిప్రణీత్ ఓటమి

డచ్ జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బి. సాయిప్రణీత్ సెమీఫైనల్లో ఇంటిదారిపట్టాడు.

నెదర్లాండ్స్‌లోని హార్లెమ్ పట్టణంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 13-21, 7-21 స్కోరు తేడాతో.. మలేషియాకు చెందిన రెండో సీడ్ ఇస్కందర్ జుల్కర్‌నైన్ చేతిలో ఓటమి చవిచూశాడు.

అంతకుమునుపు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణీత్ 14-21, 21-18, 21-3 స్కోరు తేడాతో... స్లొవేకియాకు చెందిన నాలుగో సీడ్ మెతేవ్ బాజుక్‌పై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, బాలుర డబుల్స్ విభాగంలో సాయి ప్రణీత్-ప్రణవ్ చోప్రా జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో అపజయం పాలయ్యింది.

వెబ్దునియా పై చదవండి