సైనా వర్సెస్ చైనా : నవంబర్ 12 నుంచి చైనా మాస్టర్స్

FILE
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చైనా మాస్టర్స్ టోర్నీకి సన్నద్ధమవుతోంది. నవంబరు 12 నుంచి 17 వరకు చైనాలోని షాంఘై నగరంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సంవత్సరం ఆడిన 11 టోర్నీల్లో ఒక్క టైటిల్ కూడా సాధించుకోలేని ఈ హైదరాబాదీకి ఈసారి కూడా నిరాశ తప్పదేమోనని క్రీడా పండితులు భావిస్తున్నారు.

కాగా, సైనా తొలి రౌండ్ నుంచి ఫైనల్ వరకు చైనా క్రీడాకారిణులే ప్రత్యర్థులుగా ఉండే అవకాశాలున్నాయి. తొలి రౌండ్‌లో సైనా నాలుగో క్వాలిఫయర్‌తో ఆడాల్సి ఉంది. నాలుగో క్వాలిఫయర్ హోదాలో కిన్ జింగ్‌జింగ్ (చైనా) మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందే సూచనలున్నాయి.

వెబ్దునియా పై చదవండి