2012లో జరిగే జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యం!

2012లో జరుగనున్న 35వ జాతీయ క్రీడలకు కేరళ ఆతిథ్యమిస్తోంది. ఈ ఏడాది జాతీయ క్రీడలు శనివారంతో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ క్రీడలకు కేరళ వేదిక కానుంది. తద్వారా గత 1987లో తొలిసారి జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చిన కేరళ రెండోసారి జాతీయ క్రీడలకు వేదిక కానుంది.

కేరళలోని తిరువనంతపురంలో ఈ పోటీలు జరుగుతాయి. వచ్చే ఏడాది జరుగనున్న కేరళ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో 170 మంది కళాకారుల నృత్యప్రదర్శన ఉంటుందని కేరళ ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. ఈ ప్రారంభోత్సవంలో కేరళ సాంస్కృతిక నృత్యాలు ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకుంటాయి ఆర్గనైజింగ్ వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి