గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పంట పండిస్తోంది. ఈ మేరకు మరో పతకం సాధించింది. రెండో రోజు శుక్రవారం పది మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ 16 ఏళ్ల మలైకా గోయెల్ రజత పతకంతో మెరిసింది. ఫైనల్స్లో గోయెల్ 197.1 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం కైవసం చేసుకుంది.